ఎండవేడికి వృద్ధుడి మృతి

4 Sep, 2015 20:33 IST|Sakshi

లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్‌జిల్లా): వర్షాలు లేక ఎండలు దంచి కొడుతుండడంతో వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామంలో ఎండవేడికి తట్టుకోలేక సుబ్బయ్య (70) అనే వృద్ధుడు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. శుక్రవారం ఉదయం పొలం కాపలాకు వెళ్లిన సుబ్బయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలోనే అతడు కూలబడిపోయి కనిపించాడు. ఎండకు తట్టుకోలేక అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు