‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’

22 Apr, 2015 04:20 IST|Sakshi
‘‘ఒలింపిక్’ వ్యవహారాన్ని మీరే తేల్చండి’

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు వ్యవహారాన్ని హైకోర్టు ధర్మాసనం తిరిగి సింగిల్ జడ్జికే నివేదించింది. అన్ని వర్గాల వాదనలు విని, వచ్చేవారం నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. మరోవైపు సింగిల్ జడ్జి వద్దే వాదనలు వినిపించాలని విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసిసోయేషన్, ఆంధ్రప్రదేశ్ (రెసిడ్యూరీ) ఒలింపిక్ అసోసియేషన్‌లకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.   
 

మరిన్ని వార్తలు