* రెండో విడత రిజిస్ట్రేషన్లకు 20వ తేదీ వరకు గడువు
* 29న స్పెల్ బీ రెండో దశ కాంటెస్ట్
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలను అభివృద్ధి పరిచేందుకు ‘సాక్షి-స్పెల్ బీ’ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్పెల్ బీ ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 19న జరగనుంది. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు ఆదివారం గుంటూరు లక్ష్మీపురం 4వ లైనులోని (హరిహరమహల్ థియేటర్ రోడ్డు) మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో హాజరుకావాలి. 1,2 కేటగిరీల విద్యార్థులకు ఉదయం 10.30 గంటలకు, 3,4 కేటగిరీల వారికి ఉదయం 11.30 గంటలకు కాంటెస్ట్ జరగనుంది.
ఈ నెల 29న జరగనున్న సాక్షి-స్పెల్ బీ రెండో దశ కాంటెస్ట్కు 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి కాంటెస్ట్లో పాల్గొనే విద్యార్థుల వివరాలతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేయించుకునేందుకు అవకాశం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు 99127 22911 నంబర్ను సంప్రదించాలి.