పాతగుంటూరు, న్యూస్లైన్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో మోడల్ డైట్సెట్ జూన్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.నూర్మొహమ్మద్ బుధవారం తెలిపారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సెట్ కన్వీనర్, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మోడల్ డైట్సెట్కు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉందన్నారు. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందుబాటులో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గతంలో మోడల్ డైట్సెట్లో ర్యాంకులు పొందిన వారికి ఎక్కువ సార్లు ప్రభుత్వం నిర్వహించిన డైట్సెట్లో కూడా ర్యాంకులు సాధించారని తెలిపారు. నూర్ మొహమ్మద్ మాట్లాడుతూ మోడల్ డైట్సెట్కు హాజరయ్యేవారు రూ.30, రెండు పాస్పోర్టుసైజు ఫొటోలతో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. వివరాలకు 94900 98057, 94903 00913 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వై.కృష్ణకాంత్, బి.లక్ష్మణరావు పాల్గొన్నారు.