తిరుపతి, న్యూస్లైన్ : చిత్తూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జూన్ ఒకటవ తేదీ తిరుపతిలో జరుగుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటవ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి పరిశీలకులుగా నియమితులైన జ్యోతులనెహ్రూ, బీ.గురునాథరెడ్డి, ఎం.శంకరనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన వారు, ఓడిన అభ్యర్థులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు (గెలిచిన వారు, ఓడిన వారు) సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని నారాయణస్వామి కోరారు.