మరోసారి కుంగిన భూమి

13 Dec, 2015 11:43 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. వరుసగా భూమి కుంగుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

ఆదివారం మరోసారి భూమి భారీగా కుంగింది. చింతకొమ్మదిన్నె మండలం పెద్దముసలిరెడ్డిపల్లిలోని ఓ పసుపుతోటలో 20 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. జిల్లాలో వరుసగా పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో గ్రామస్తులతో పాటు ప్రజలు భయందళోనలు గురవుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో గత పదిహేను రోజుల్లో రెండు సార్లు భూమి కుంగడం జరిగింది.
 

మరిన్ని వార్తలు