అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు సహకార సొసైటీలో రూ.కోటి గోల్మాల్ జరిగింది. సొసైటీ అధ్యక్షుడు సురేష్ బాబుపై రైతులు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు బినామీ పేర్లతో నగదు స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.