సహాద్యోగి దాడితో యువకుడి మృతి

2 Feb, 2016 18:21 IST|Sakshi

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సహచర ఉద్యోగుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మెలియపుట్టి మండలం జాడుపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

అల్లా అచ్యుతరావు (32), గోస నాగేశ్వరరావు (60) వీరిద్దరూ ఒకే సంస్థలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం గ్రామంలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే నాగేశ్వరరావు రాయితో అచ్యుతరావుపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు