విషాహారం తిని ఒకరు మృతి

15 Nov, 2015 17:43 IST|Sakshi

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుణానపురంలో కలుషిత ఆహారం తినటం వల్ల ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.  వివరాల్లోకి వెళితే.. కర్రి జగన్నాథం, ఆయన భార్య కౌసల్య, మనవడు గోపీచందర్ ఆదివారం మధ్యాహ్నం తోత (రాగి సంగటి) తిన్నారు. ఆ తర్వాత జగన్నాథం మృతి చెందగా, మిగతా ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సిఫారసు చేశారు.


 

మరిన్ని వార్తలు