బాణాసంచా పేలుడు ఒకరి మృతి

10 Nov, 2015 10:29 IST|Sakshi

గుంటూరు జిల్లా: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెనాలి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

 

మరిన్ని వార్తలు