తాతమనవళ్లపైకి దూసుకెళ్లిన లారీ

1 Jul, 2016 07:50 IST|Sakshi

ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తాతా,మనవడి మీదుకు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా... తాత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు