బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి

13 Dec, 2015 19:19 IST|Sakshi

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కంభం పట్టణానికి చెందిన కోటి (25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు