ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు : ఒకరి మృతి

30 Jun, 2016 08:28 IST|Sakshi

ఒంగోలు :  ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణంగివరం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. అలాగే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. తిరుమల నుంచి భద్రచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు