100 నంబర్‌కు 298 సార్లు..

4 Mar, 2017 17:45 IST|Sakshi
విజయవాడ: పోలీస్‌ కంట్రోల్‌ రూంనకు దాదాపు 300 సార్లు ఫోన్‌ చేసి వేధించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన మురశి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా 100, 104, 108 నంబర్లకు ఫోన్‌ చేసి మహిళా సిబ్బందిని వేధించటమే పనిగా పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం మురళిని అదుపులోకి తీసుకున్నారు. మురళి మొత్తం 298 సార్లు పోలీస్‌కంట్రోల్‌ రూంలో ఉన్న 100 నంబర్‌కు ఫోన్‌ చేశాడని డీసీపీ పాలరాజు చెప్పారు. 
 
 
మరిన్ని వార్తలు