బాలికపై ఏడాదిగా లైంగికదాడి

18 Oct, 2013 04:28 IST|Sakshi

జడ్చర్ల, న్యూస్‌లైన్: ఏడాదికాలంగా మైనర్‌బాలికను ఓ యువకుడు లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఆలస్యంగా ఈ దారుణం గురువారం మండలంలోని నెక్కొండ గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక(16) తండ్రి పక్షవాతం తో బాధపడుతూ మంచంపట్టాడు. తల్లితో కలిసి తండ్రికి సపర్యలు చేస్తూ ఇంటివద్దే ఉంటుంది. బాధితురాలి ఇంటిపక్కనే ఇల్లు ఉన్న విద్యాసాగర్ ఇంటర్‌మీడియట్ వరకు చదివి ఇంటివద్దే ఉన్నా డు.
 
 బాలికను ఏడాది కాలంగా బెదిరింపులకు గురి చేస్తూ లొంగదీసుకున్నాడు. ఏడాదిగా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేసి అబార్షన్ చేయించాడు. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టి నిలదీయగా తనకేమీ సంబంధం లేదని బుకాయించాడు. దీంతో ఆ బాలిక చేసేదిలేక బంధువుల సహాయంతో జడ్చర్ల పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి పంపి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటరమణ తెలిపారు.
 
 అనుమానాస్పదంగా తండ్రి మృతి
 కాగా, లైంగికదాడికి గురైన బాలిక తండ్రి రాములు(45) బుధవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడు డ్రిప్‌పైపుతో ఉరేసుకున్నాడని చెప్పారు. ఇంట్లో రక్తం మరకలు, శరీరం పై గాయాలు ఉండటంతో అనుమానాస్పదంగా మృతిచెంది న ట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నింది తుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలనిబాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు