కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలం కేశవదాసుపాలెం శివారులో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం రేగింది. గ్రామ శివారులో సోమవారం ఉదయం గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అదికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు.