ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన  ఎంపీ మాగుంట

23 Jun, 2019 10:24 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో నూతనంగా ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న మాగుంట ప్రత్యేకంగా వీరిని కలిశారు. వెంకయ్యనాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. వెంకయ్యనాయుడు మాగుంట కుటుంబం గురించి సంక్షిప్తంగా ప్రధానికి వివరించారు. 

మరిన్ని వార్తలు