సాక్షి, అమరావతి : లాక్డౌన్లో పట్టుబడ్డ వాహనాలను తిరిగి తీసుకెళ్లొచ్చని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సవాంగ్ అన్నారు. వాహన యజమానులు సంబంధిత పీఎస్ను సంప్రదించాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు పీఎస్లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. (కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు)