పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం

10 May, 2015 09:16 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి.

మరిన్ని వార్తలు