ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్‌ దౌర్జన్యం 

15 Mar, 2020 15:34 IST|Sakshi

సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో  ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్‌ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్‌ పట్టుకుని శ్రీరామ్‌ బెదిరింపులకు దిగారు.


(మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం)

మరిన్ని వార్తలు