అనూహ్య హత్యకు నిరసనగా హైదరాబాద్‌లో పాస్టర్ల ధర్నా

1 Feb, 2014 01:21 IST|Sakshi
అనూహ్య హత్యకు నిరసనగా హైదరాబాద్‌లో పాస్టర్ల ధర్నా

హైదరాబాద్: అనూహ్య హత్యకు నిరసనగా శుక్రవారం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ బైబిల్ హౌస్ నుంచి ఇందిరాపార్కు వరకూ శాంతి ర్యాలీ చేపట్టారు.
 
 ధర్నాలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నట్లు సీబీఐ విచారణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ స్వరణ్‌జిత్ సేన్, సీఎస్‌ఐ మోడరేటర్ దైవాశ్వీరాదం, ఆర్చ్ బిషప్ తుమ్మ బాల, ఫాదర్ బాలా, మెదక్ డయాసిస్ వైస్ ఛైర్మన్ ఏసీ సాల్మన్ రాజు, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, వివిధ క్రిస్టియన్ సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు