పవన్‌కల్యాణ్‌ ఇంటికి నేడు భూమి పూజ

12 Mar, 2018 01:28 IST|Sakshi
కుటుంబ సభ్యులతో విజయవాడ చేరుకున్న పవన్‌

గుంటూరు జిల్లా కాజ వద్ద నిర్మాణం 

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ గుంటూరు జిల్లా కాజ వద్ద సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం తెల్లవారుజామున భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్‌కల్యాణ్‌ ఆదివారం సాయంత్రమే విజయవాడ చేరుకున్నారు.

కాజ వద్ద దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇల్లు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను పవన్‌కల్యాణ్‌ ఒక ప్రైవేట్‌ నిర్మాణ సంస్థకు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భూమి పూజకు పవన్‌ అత్యంత సన్నిహితులకే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు