కాలినడకన తిరుమలకు పవన్‌..

13 May, 2018 13:50 IST|Sakshi

తిరుమల: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి నడక ప్రారంభించిన ఆయన దారి వెంబడి అందరినీ పలకరిస్తూ ముందుకుసాగారు. మధ్యమధ్యలో విశ్రాంతి తీసకుంటూ, అక్కడ సంచరిస్తోన్న కుక్కపిల్లకు బిస్కెట్లు తినిపిస్తూ సందడిచేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్‌కు టీటీడీ అధికారులు స్వాగతంపలికి శాలువా కప్పారు. దగ్గరుండి దర్శనం చేయించిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. మే 15 నుంచి గ్రామ స్వరాజ్య యాత్ర చేపట్టనున్న పవన్‌ కల్యాణ్‌.. ఈ మూడు రోజులూ తిరుపతిలోనే ఉండనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు