హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు విచారణ సాగుతుండగానే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
చంద్రబాబుపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బలం లేకపోయినా టీడీపీ కర్నూలు, ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తోంది. వైఎస్ఆర్ నాయకులను ప్రలోభపెడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.