తూర్పుగోదావరి : ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తొలగించిన పింఛను మళ్లీ ఇస్తున్నారన్నా అని ఏపీ త్రయానికి చెందిన కరి సీత జగన్కు తెలిపింది. అన్నా నా చిన్న వయస్సులోనే మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మకు వితంతు పింఛను వస్తుంది, గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేసినందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ల పాటు మా అమ్మ పింఛను తొలగించారని, తిరిగి ఏప్రిల్ నెల నుంచి పింఛను ఇస్తున్నారని తెలిపింది.