తూర్పుగోదావరి : జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నా పింఛను సొమ్ము పెంచుతానన్నారని కరకుదురుకు చెందిన విప్పర్తి వరహాలు ఆనందం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఒక కన్ను లేదని, వైఎస్ తనకు పింఛను ఇచ్చి ఆదుకున్నారని తెలిపింది. ప్రస్తుతం తనకు రూ. వెయ్యి పింఛను ఇస్తున్నారని, పాదయాత్రలో జగన్ను కలవగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను సొమ్ము పెంచుతానని హామీ ఇచ్చారని తెలిపింది.