టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..!

15 Feb, 2019 17:40 IST|Sakshi
ముప్పిడి వెంకటేశ్వరరావు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, పశ్చిమ గోదావరి: గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. వేంపాడులో శుక్రవారం వాటర్‌ట్యాంక్‌ ప్రారంభించడానికి వచ్చిన ఆయనకు స్థానిక ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. నియోజకవర్గంలోని సమస్యలపై వెంకటేశ్వరరావును ప్రజలు నిలదీశారు. గత నాలుగున్నరేళ్లలో ఈ ప్రాంత సమస్యలపై కనీసం స్పందించలేదని, ఎన్నికలు సమీపిస్తున్నందునే ప్రజలు గుర్తొచారా? అని ఆయనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభించకుండానే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా గతకొంత కాలంగా అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుకెళ్లామని, కనీసం తమ విజ్ఞప్తిని కూడా ఆయన పట్టించుకోలేదని అక్కడి స్థానికులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు