ఆత్మకూరురూరల్ : వైఎస్ జగన్మోహన్రెడ్డితో దిగిన సెల్ఫీని గుండెల్లో దాచుకుంటామని విద్యార్థులు పేర్కొన్నారు. కొండాపురం మండలం ఆదిమూర్తిపురం వద్ద గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మంచాల ప్రవీణ్, శ్రీనివాసులు, కిరణ్, వల్లూరు వినోద్, పర్రి చరణ్ కలిశారు. తమ వెంట తెచ్చుకున్న ట్యాబ్తో జననేత వైస్ జగన్తో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి, బాగా చదువుకోవాలని పేర్కొన్నారు.