పిల్లలు చదువుకున్నా నౌకరీ రాలేదయ్యా

22 Feb, 2018 06:31 IST|Sakshi
జగన్‌ను కలిసి తమ సమస్యలు తెలియచేసిన లక్ష్మిరెడ్డి

పర్చూరు: పిల్లలు పెద్దచదువులు చదివినప్పటికీ నాలుగేళ్లుగా నౌకరీ రాక ఇబ్బంది పడుతున్నారని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గోపీరెడ్డి లక్ష్మీరెడ్డి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. పిల్లలు బెంగళూరు, హైదరాబాదు తిరుగుతున్నారు కానీ నౌకరీ మాత్రం ఎప్పుడు వస్తుందో ఏమో అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారని.. తినడానికి గేదెలకు మేతకూడా లేదని జగన్‌ ఎదుట వాపోయాడు.

మరిన్ని వార్తలు