పర్చూరు: పిల్లలు పెద్దచదువులు చదివినప్పటికీ నాలుగేళ్లుగా నౌకరీ రాక ఇబ్బంది పడుతున్నారని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గోపీరెడ్డి లక్ష్మీరెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. పిల్లలు బెంగళూరు, హైదరాబాదు తిరుగుతున్నారు కానీ నౌకరీ మాత్రం ఎప్పుడు వస్తుందో ఏమో అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారని.. తినడానికి గేదెలకు మేతకూడా లేదని జగన్ ఎదుట వాపోయాడు.