పదేళ్లుగా పని చేస్తున్నా భద్రత లేదు

8 Mar, 2018 06:40 IST|Sakshi

చీరాలటౌన్‌: ‘పదేళ్లుగా 108లో ఉద్యోగాలు చేస్తున్నాం. నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. మాకు ఉద్యోగ భద్రత లేదు. వాహనాల నిర్వహణ గాలికొదిలేశారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు వెళ్తామన్నా డీజిల్‌ కూడా ఇవ్వడం లేదు’ అంటూ ఇంకొల్లు 108 వాహన ఉద్యోగులు దేవరాజ్, కిరణ్, వాసు, నాగరాజు తదితరులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

>
మరిన్ని వార్తలు