జగన్‌తో మేము సైతం

12 Mar, 2018 06:50 IST|Sakshi
వాకర్స్‌ టీమ్‌ సభ్యులు

ఒంగోలు వన్‌టౌన్‌: ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా మేము సైతం అంటూ వాకర్స్‌ సభ్యులు ఆయన్ను అనుసరిస్తున్నారు. 35 మందికి పైగా ఉన్న 13 జిల్లాలకు చెందిన వాకర్స్‌ సభ్యులకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే అభిమానం. ్ఞఆయన బిడ్డ.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనంలోనికి రావడంతో జగన్‌ను అనుసరిస్తున్నామని సభ్యులు తెలిపారు. మండెపూడి పురుషోత్తం, ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, చిట్టే సత్తిరెడ్డి, కె.హరికృష్ణారెడ్డి, వి.శంకర్, కట్టా నాగ విక్రం, ఫణిభూషణ్, కైడి సీతారాం, యం.సుబ్బరాయుడు మేడిశెట్టి వెంకట రమణ తదితరులు నాయకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు