జగనన్నకు నూతన వస్త్రాలు

12 Mar, 2018 06:54 IST|Sakshi
మిక్కిలి సురేష్, హసీనా దంపతుల కుమార్తె మిక్కిలి ఇస్మత్‌

చీరాల టౌన్‌: ప్రజా సంకల్పయాత్రలో చీరాలలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చీరాల మున్సిపాలిటీలోని రామ్‌నగర్‌కు చెందిన ఇత్తడి లీల నూతన వస్త్రాలను అందించింది. ఆయన సీఎం కావాలని ఆకాంక్షించింది.

మీరే ఆదుకోవాలి
ఒంగోలు వన్‌టౌన్‌: చీరాల మండలం సాయికాలనీకి చెందిన మిక్కిలి సురేష్, హసీనా దంపతుల కుమార్తె మిక్కిలి ఇస్మత్‌ పుట్టుకతోనే సీటీఈవీ వెన్ను సమస్యతో పుట్టింది. 8 సంవత్సరాలు వయస్సు వచ్చినా నేటికీ నిలబడలేని స్థితిలో ఉందని ఇస్మత్‌ కుటుంబ సభ్యులు జగన్‌ ముందు విలపించారు. ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా వైద్యం కోసం ఖర్చు పెట్టామని తమ కుమార్తెను ఇంకా కాపాడే శక్తి లేదని వాపోయారు.

మరిన్ని వార్తలు