ఆ పార్టీ వాళ్లకే పక్కా ఇళ్లంట

16 Mar, 2018 06:15 IST|Sakshi

గుంటూరు: పేదరికాన్ని చూడకుండా పార్టీనే అర్హతగా ఇళ్ల మంజూరులో పక్షపాతం చూపిస్తున్నారంటూ కసుకర్రుకు చెందిన రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కçసుకర్రులో పర్యటించిన వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆమె తమ గోడును వెళ్ల్లబోసుకున్నారు. జన్మభూమిలో అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఇల్లు మంజూరు చేయలేదని, అదేమని అడిగితే టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లమని చెబుతున్నారని వాపోయారు. అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు