గుంటూరు: ప్రజాసమస్యలు వింటూ, భరోసా కల్పిస్తూ జననేత జగన్ సాగిస్తున్న పాదయాత్రలో ఇడుపులపాయ నుంచి జననేత వెంటే జిల్లాకు చెందిన పలువురు నేతలు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి వింతా శివనాగిరెడ్డి, నర్సారావుపేటకు చెందిన ఏరువ వెంకటేశ్వరరెడ్డి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రలో పాల్గొంటున్నారు.