సంకల్ప దీక్ష..

16 Mar, 2018 06:28 IST|Sakshi

గుంటూరు:‘అన్నా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నాలుగు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నా’ అంటూ కసుకర్రు గ్రామానికి చెందిన పూల సుబ్రహ్మణ్యం జననేత వద్ద తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ నెల 12 నుంచి  గ్రామంలో రోడ్డు పక్కనే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినట్టు వివరించారు. ‘ప్రత్యేక హోదా కోసం నెల రోజుల క్రితం విజయవాడలోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలసి వినతిపత్రం అందజేశా. అది ఇప్పుడు సాధ్యపడే అంశం కాదన్నారు. గతంలో రెండు సార్లు ఉండవల్లిలో సీఎం చంద్రబాబునాయుడును కలిశా.. ప్రభుత్వం దానికోసమే పోరాడుతుందన్నారు. నాయకులు చెప్పిన పచ్చి అబద్ధాలు నమ్మి మోసపోయా. అందుకే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టా’నన్నారు. దీక్ష చేపట్టిన సుబ్రహ్మణ్యాన్ని జననేత అభినందిస్తూ మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు