గుంటూరు:‘బిడ్డ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు.. ఆదుకోండయ్యా’ అంటూ మాచవరం గ్రామానికి చెందిన ముస్లిం మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కసుకర్రు గ్రామానికి చేరుకున్న జననేత జగన్మోహన్రెడ్డిని కలసి కన్నీటి పర్యంతమయ్యారు. షేక్మీరాసాహెబ్, నెహ్రూన్బీలకు ముగ్గురు సంతానం. 21ఏళ్ల బాబు షేక్ జానీబాషా ఇంటర్ వరకూ చదువుకుని ఆర్మీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించారు. డాక్టర్లు బాబుకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ప్రస్తుతం చెన్నై అడయార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాంతకమైన వ్యాధి నుంచి తన బిడ్డని ఎలాగైనా కాపాడాలని జగన్ను కోరారు.