గుంటూరు:పిల్లల ఫీజుల కోసం బంగారం తాకట్టు పెట్టాం. బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని కాకుమాను గ్రామానికి చెందిన బత్తుల నిర్మల, థామస్ దంపతులు వైఎస్ జగన్ ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. ఉన్నత చదువులు చదివించాలంటే ఫీజులు చెల్లించలేకపోతున్నాం. అధికారులను ప్రజాప్రతినిధులను అడిగినా పట్టించుకోవటం లేదు. కేవలం అధికార పార్టీ నేతలకే న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ వారికే అందుతున్నాయే కానీ అర్హులకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.