జాబు రాలేదు.. భృతీ అందలేదు

20 Mar, 2018 06:56 IST|Sakshi

గుంటూరు:బాబు వస్తే జాబు వస్తుందంటూ ఢంకా బజాయించారు.. కానీ అవి ఉత్తమాటలేనని స్పష్టమవుతోంది. ఎన్నికలు పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా నేటి వరకు ఉద్యోగాల జాడే లేదని కొమ్మూరుకు చెందిన నిరుద్యోగ యువత వైఎస్‌ జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా కాకుమాను మండలం కొమ్మూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వి. వంశీ, యు. భాను ప్రకాష్, కె. నాగభూషణం తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని నిరుద్యోగ భృతిని కూడా ఇచ్చిన దాఖలాలు లేవని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను కూడా అమలు చేయడం లేదన్నారు. వీఆర్వో పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా ద్వారానే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. 

మరిన్ని వార్తలు