గుంటూరు:నా పెనిమిటి నాలుగేళ్ల కిందట వడదెబ్బ తగిలి చనిపోయాడు.. నష్టపరిహారం కింద డబ్బులు వస్తాయని చెప్పారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఉపయోగం లేకుండా పోయిందని దొప్పలపూడి దానమ్మ జగన్మోహన్రెడ్డిని సోమవారం కలిసి తన బాధను చెప్పుకుంది. నాలుగేళ్లుగా డబ్బుల కోసం తిరుగుతున్నానని, తెలుగుదేశం కండువా కప్పుకుని వస్తే డబ్బులిప్పిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారంటూ వాపోయింది. వితంతు పింఛన్ అయినా ఇప్పిస్తారేమోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ కనికరించడం లేదయ్యా.. అంటూ కన్నీటి పర్యంతమైంది.