గుంటూరు:అన్నా.. రెండేళ్లుగా స్కాలర్షిప్లు అందకపోవడంతో చదువులు ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్నామని కొమ్మూరుకు చెందిన మైనార్టీ విద్యార్థినులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్ను కలిసిన డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎంఎస్కే హజరాబి ఇంటర్మీడియెట్లో స్కాలర్షిప్ రాలేదని, కంటి తడుపుగా డిగ్రీలో ఒక సంవత్సరం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని వివరించింది. 9వ తరగతి చదువుతున్న ఎం. ఎక్బేర్ గత మూడేళ్లుగా స్కాలర్షిప్లు అందడం లేదని తెలిపింది. ఏడాదికి రూ.5 వేలు గతంలో అందేదని, ఇప్పుడు రాకపోవడంతో తల్లిదండ్రులపైన భారం పడుతుందని చెప్పింది. ఆరో తరగతి విద్యార్థి జానీభేగం కూడా జగన్ను కలిసి ఉపకారవేతనం ఇవ్వడం లేదని వాపోయింది.