గుంటూరు: తల్లీ చదువు మధ్యలోనే ఆపేయకూడదు. మంచిగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ బాలికకు సూచించారు. పనుల నిమిత్తం వలస వచ్చిన కూలీలు మంగళవారం వైఎస్ జగన్ను కలిశారు. వారి వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో తల్లిదండ్రులతో కలిసి మిరప కోతలకు వచ్చిన బాలిక కుమారిని జగన్ గమనించారు. ‘ఏం చదువుతున్నావ్.. తల్లీ ’అంటూ ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువు మధ్యలోనే ఆపేసి కూలి పనులకు వెళుతున్నానని చెప్పడంతో జగన్ చలించిపోయారు. అలా కాదు తల్లీ.. పనులకు వలస వచ్చినా.. ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉండే బడికి వెళ్లి చదువుకోవాలని సూచించారు. ఆ బాలికను స్కూల్కు పంపించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించారు.