గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలి

29 Mar, 2018 07:01 IST|Sakshi

గుంటూరు: గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలందిస్తున్న తమనుప్రభుత్వం గుర్తించేందుకు కృషి చేయాలనిఆర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు జననేతను కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నందిగామ సమీపంలో వైఎస్‌ జగన్‌ను కలసి సమస్యలు విన్నవించారు. తమకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గుర్తింపు నివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో శిక్షణా కేంద్రాలను నిర్వహించారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. జగన్‌ను కలసిన వారిలో డివిజన్‌ అధ్యక్షుడు వి.సాంబశివరావు, కె.శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసరావు, షేక్‌ బాషా తదితరులున్నారు.

మరిన్ని వార్తలు