గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో అభిమానం ఉరకలేస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదమక్కెన గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభిమానులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డాబాపై ఫ్యాన్ను ఏర్పాటు చేసి, వైఎస్సార్ సీపీ పతాక వర్ణాలు దిద్దారు. పాదయాత్రలో వస్తున్న అశేష ప్రజావాహినిని ఉద్దేశించి.. ‘గుర్తుంచుకోండి.. మనది ఫ్యాన్ గుర్తు’ అంటూ నినదించారు.