గుంటూరు : ‘అన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పీఈటీ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉచ్చుల స్టాలిన్బాబు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని మోరంపూడిలో జగన్ను కలసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన పీఈటీలు ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయని కారణంగా ప్రైవేట్ స్కూళ్లలో చాలీచాలని జీతాలకు పనిచేస్తున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 10వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు.