రోడ్డు ప్రమాదానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారు

13 Apr, 2018 07:04 IST|Sakshi

‘అయ్యా.. రోడ్డు ప్రమాదంలో నా భర్త తలకు తీవ్రగాయం కావడంతో పాటు కాలు విరిగిపోయింది. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయమంటున్నారు’ అంటూ మహానాడుకు చెందిన ఇలింగి జయలక్ష్మి జననేత ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మహానాడు రోడ్డులో జగన్‌ను కలసి సమస్య విన్నవించారు. తన భార్త నాలుగు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పారు. ఆరోగ్యశ్రీ వర్తించదంటే అప్పు చేసి వైద్యం చేయించానని వివరించారు. ప్రస్తుతం తన భర్త మంచంపై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  చంద్రన్న బీమా ద్వారా ఒక్క రూపాయి కూడా అందలేదని, మీరే ఆదుకోవాలని జగన్‌ను కోరారు.

మరిన్ని వార్తలు