కృష్ణా జిల్లా : ‘అన్నా.. నా కుమారుడు సాయితేజ చిన్నతనం నుంచి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. 14 ఏళ్ల వయస్సు వచ్చినా మానసిక ఎదుగుదల లేదు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించదన్నారు’ అని కొత్తూరు తాడేపల్లికి చెందిన రజని ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించామని, అయినా ప్రయోజనం లేదని తెలిపారు. ముంబాయి తీసుకెళ్లి వైద్యం చేయించాలని డాక్టర్లు సూచించారని, తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని ఆమె జననేతను కోరారు.