చెరువుల భౌతిక స్వరూపమే మార్చేస్తున్నారు

16 Apr, 2018 07:26 IST|Sakshi

కృష్ణా జిల్లా : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా మైలవరం నియోజకవర్గంలోని చెరువుల్లో అక్రమ తవ్వకాలు జరిపిస్తూ చెరువుల భౌతిక స్వరూపమే మార్చేస్తున్నారని జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన పామర్తి వెంకటనారాయణ ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టిని వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువచ్చారు. బుడమేరు విస్తరణ పనుల్లో భాగంగా 60మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు ఒక యూనిట్‌గా విభజించి యూనిట్‌కు రూ.10లక్షల చొప్పున రూ.20కోట్ల వరకు మంత్రి అనుచరులు దోచుకున్నారని జగన్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు