వలస కూలీలుగా మారుతున్నాం

16 Apr, 2018 07:29 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. కుల వృత్తులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి మాకు సరైన ఆదరణ లేకపోవడంతో తాత, తండ్రుల నాటి నుంచి వచ్చిన కుల వృత్తులను వదిలి వలస కూలీలుగా మారుతున్నాం’ అని కొత్తూరు తాడేపల్లికి చెందిన గీత కార్మికుడు ఉయ్యూరు పూర్ణచంద్రరావు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గీత కార్మికుల స్థితిగతులను వివరించారు. రియల్‌ ఎస్టేట్, వివిధ సంస్థలకు భూములను కట్టబెట్టడం వల్ల పొలంగట్లపై ఉన్న తాటిచెట్లను కొట్టేస్తున్నారని, దీంతో తమ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కల్లుగీత కార్మికులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు.

>
మరిన్ని వార్తలు