మా ఇళ్లు కూల్చేస్తామంటున్నారు

16 Apr, 2018 07:31 IST|Sakshi

కృష్ణా జిల్లా : ‘అన్నా.. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. శాశ్వత నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో మా ఇళ్లు కూల్చేస్తామంటున్నారు’ అని కొత్తూరు తాడేపల్లి చెరువుగట్టు ప్రాంతానికి చెందిన దుర్గ వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు తొలిగిస్తే వందకు పైగా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె జననేతకు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రభుత్వం సరైన నష్టపరిహారం కూడా ప్రకటించకుండా నిత్యం తమను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు