కృష్ణా జిల్లా :‘మేము డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు దాటుతోంది. బాబు వస్తే...జాబు వస్తుందని గత ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి ఓటు వేశాం. నేటికి నాలుగేళ్లు పూర్తయినా కనీసం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఊసు కూడా ఎత్తడం లేదు’ అని ఇంచిపేట, నిడమానూరుకి చెందిన నగీనా, ముభీనాలు ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్ను కలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నామని, పూటగడవడం కూడా చాలా కష్టంగా ఉందని జననేతకు తెలిపారు.